బాహుబలి2 ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే పలు మీడియా ఛానల్స్ చుట్టేసిన టీమ్.. ఇప్పుడు ఎయిర్టెల్ నెట్ వర్క్ తో చేతులు కలిపింది. బాహుబలితో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంటున్నట్లు భారతీ ఎయిర్టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఈఓ వెంకటేష్ విజయరాఘవన్ వెల్లడించారు. రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, ప్రభాస్, రాణా, అనుష్కల తో ఈ మేరకు బంజారాహిల్స్లోని పార్క్హయత్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వివరాలు వెల్లడించారు. ఎయిర్టెల్ నుంచి బాహుబలి సిమ్తోపాటు ఉచిత 4జీ డేటా, బాహుబలి 4జీ రీఛార్జ్ ప్యాక్, బాహుబలి కంటెంట్లో భాగంగా వీడియోలు, వింక్ మ్యూజిక్, గెస్ట్ ఎడిటర్స్, ఇలా ప్రత్యేకమైన ఉత్పత్తులు అందిస్తున్నట్లు వివరించారు.
తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచస్థాయికి చేర్చింది ‘బాహుబలి. తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచస్థాయికి చేర్చిన చిత్రం ‘బాహుబలి కొనసాగింపుగా ఇప్పుడు బాహుబలి: ద కన్క్లూజన్ చూపించబోతున్నారు రాజమౌళి. ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లు సాధించిన ‘బాహుబలి’కి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి 2పై కూడా భారీ అంచనాలు వున్నాయి. ఏప్రిల్ 28న ‘బాహుబలి-2’ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.