నిన్నే పెళ్లాడతా+ మన్మథుడు= రారండోయ్‌

veduka

నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా చిత్ర బృందం అన్నపూర్ణ స్టూడియోలో మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఈ సినిమా స్టోరీ లైన్ చెప్పారు. ”ఒకమ్మాయి తనకొచ్చే భర్త రాకుమారుడిలా ఉండాలని కలలుగంటుంది. ఆ రాకుమారుడు ఎవరు? ఎలా ఉంటాడు? ఆ అమ్మాయి కల నెరవేరిందా? లేదా? అన్నదే చిత్ర కథ” అన్నారు

అలాగే ”నాకు బాగా నచ్చిన రొమాంటిక్‌ చిత్రాలు ‘నిన్నే పెళ్లాడతా’, ‘మన్మథుడు’. కుటుంబ బంధాలు, ఎమోషన్‌ సీన్స్‌ ‘నిన్నే పెళ్లాడతా’లో చూపించాం. ఇక ‘మన్మథుడు’లో ఎంటర్‌టైనమెంట్‌తో పాటు సెన్సిటివ్‌ లవ్‌ని చూపించాం. ఆ రెండింటినీ కలిపి ఓ సినిమా చేస్తే బాగుంటుందని అనిపించింది. సరిగ్గా అలాంటి కధే కుదిరింది. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది” అని చెప్పుకొచ్చారు నాగార్జున.