వీళ్లే ఏ పాపం చేసారు అరవింద్..?

Dilraju-sanmanam

ఇండస్ట్రీ లో చిన్న చిత్రాలు ఎప్పుడు తొక్కపడతాయని మరోసారి రుజువయ్యింది..తెలుగు చిత్రాలైన శతమానం భవతి , పెళ్లి చూపులు చిత్రాలు తాజాగా జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. ఉత్తమ చిత్రంగా శతమానం భవతి , సంభాషణల విభాగంలో పెళ్లి చూపులు కు గాను జాతీయ అవార్డ్స్ దక్కాయి. ఈ సందర్భాంగా మెగా వర్గం వారు నిర్మాత దిల్ రాజును అపూర్వంగా సన్మానించేసింది. ఇది చాల శుభా పరిమాణమే తప్పులేదు. ఎప్పుడు ఫ్యామిలీ చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ మానవ సంబంధాలను గురించి గుర్తు చేస్తుంటాడు రాజు..అందుకు సన్మానించారు.

pellichupulu-producers

కానీ ఈ సన్మానం లోనే పెళ్లి చూపులు సినిమా నిర్మాతలను కూడా సన్మానిస్తే బాగుండేదని సినీ ప్రేక్షకులు అనుకుంటున్నారు.. కోటి రూపాయల లోపు ఖర్చుతో మంచి సినిమా తీసి ప్రేక్షకులను అందించడం తో పాటు లాభాలను చవిచూశారు. అంటువంటి దర్శక, నిర్మాతలను సన్మానిస్తే మరోసారి కూడా ఇలాంటి మంచి సినిమాను తీసేవారు కదా అని అంత అంటున్నారు. మరి చిన్న నిర్మాతలు వీరిని సన్మానించడం ఎందుకులే అని అరవింద్ అనుకున్నాడా..? లేక మరో రోజు వారిని సన్మానిద్దాం అనుకున్నాడో తెలియదు.