కోర్ట్ మెట్లు ఎక్కిన సంజ‌య్ ద‌త్.

sanjay

మరోసారి స్టార్ హీరో సంజ‌య్ ద‌త్ కోర్ట్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ ష‌కీల్ నూరానీ దాఖ‌లు చేసిన కేసులో సంజయ్ కోర్టుకు వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది. 2009లో ష‌కీల్ నూరానీ డైర‌క్ష‌న్‌లో జాన్ కీ బాజీ చిత్రం షూటింగ్ మొద‌లైంది. అందులో ప్ర‌ధాన పాత్ర సంజ‌య్ ద‌త్ పోషించాడు. అయితే ఆ ఫిల్మ్ షూటింగ్ పూర్తి కాలేదు. సంజ‌య్ షూటింగ్‌కు స‌రిగా రాలేదు. ఆ ఫిల్మ్ నిర్మాణం కూడా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. దీంతో నూరానీ ప్రొడ్యూజ‌ర్స్ సంఘం ముందు ఫిర్యాదు చేశాడు.

Sanjay Dutt
ఆ త‌ర్వాత సంజ‌య్ ద‌త్ నుంచి నూరానీకి బెదిరింపులు మొద‌ల‌య్యాయి. ఆ తర్వాత ముంబై పేలుళ్ల కేసులో కొన్నేళ్లు జైలు శిక్ష అనుభ‌వించిన సంజ‌య్ ద‌త్ గ‌త ఏడాది విడుద‌ల‌య్యారు. ఆ త‌ర్వాత నూరానీ కేసులో కోర్టు ముందు హాజ‌ర‌య్యేందుకు సంజ‌య్ నిరాక‌రించారు. దీంతో ఇటీవ‌ల అంథేరీ కోర్టు బాలీవుడ్ స్టార్‌కు నాన్‌బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో ఇవాళ సంజ‌య్ కోర్టుకు హాజ‌ర‌య్యారు.