వరుణ్తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా బేబి భవ్య సమర్పణలో లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్పై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ఠాగూర్ మధు నిర్మాతలుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `మిస్టర్`. మెగా అభిమానుల భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది..
కొద్దీ సేపటి క్రితం హైదరాబాద్ లోని ప్రసాద్స్ ఐ మాక్స్ లో మార్నింగ్ షో పూర్తి చేసుకుంది.చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ షో తిలకించడం జరిగింది.. చాల రోజుల తర్వాత శ్రీను వైట్ల నుండి ఓ ఫ్రెష్ స్టోరీ చూశామంటూ ప్రేక్షకులు అంటున్నారు. సినిమా లో వరుణ్ తేజ్ చాల స్టయిలిష్ గా ఉన్నాడని , డైలాగ్ డీలివరీ, ఫైట్స్ లలో చాల ఇంప్రూవ్ అయ్యాడని చెపుతున్నారు. హెబ్బా పటేల్ కూడా మరోసారి తన గ్లామర్ తో కట్టిపడేసింది. ఇక లావణ్య త్రిపాఠి ఈ మూవీ లో కాస్త అందాల ఆరబోత చేసిందని..తెర ఫై ఆమె నటన .గ్లామర్ ఆకట్టుకుందని పబ్లిక్ చెపుతున్నారు.
రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి మధ్య ఫన్నీ సీన్స్ ప్రేక్షకుల చేత నవ్వులు తెప్పించాయి. హీరో ప్రిన్స్ ‘సిద్ధార్థ్’ గా అదరగొట్టాడు. సినిమా దర్శకుడిగా కమిడియన్ పృథ్వి కామెడీ అదరగొట్టాడు.. ఓవరాల్ గా చక్కటి ప్రేమ కథ గా మిస్టర్ బాగుందని అంత చెపుతున్నారు.