తెలంగాణాలో జరిగిన సకల జనుల సమ్మె సమయంలో వార్తల్లో ప్రముఖంగా వినిపించిన పేరు స్వామిగౌడ్. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్ అయిన స్వామిగౌడ్ ఈ రోజు నుండీ స్వామిగౌడ్ ఇక ప్రత్యక్ష రాజకీయాలలోకి రానున్నారు. తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీలో సభ్యత్వం తీసుకోనున్నారు. తెలంగాణభవన్లో ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు సమక్షంలో శుక్రవారం ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. సకల జనుల సమ్మె తీవ్ర స్థాయికి తీసుకెళ్లడంలో స్వామిగౌడ్ కీలకపాత్ర వహించిన విషయం తెలిసిందే. టీఎన్జీవోలో వివిధ స్థాయిల్లో పనిచేసిన ఆయన.. ఉద్యోగుల సమస్యలపై అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. తాను టీఆర్ఎస్లో కేసీఆర్ ఆహ్వానం మేరకే చేరుతున్నట్టు స్వామిగౌడ్ తెలిపారు.