లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న త్రిష , తాజాగా తెలుగు లో మరో గోల్డెన్ ఛాన్స్ దక్కిందని సమాచారం. ఓంకార్ -నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘రాజుగారి గది – 2’ లో త్రిష హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని సమాచారం. మొత్తం ఈ మూవీ లో ముగ్గురు హీరోయిన్స్ కాగా వారిలో ఇప్పటికే రన్ రాజా రన్ ఫేమ్ సీరత్ కపూర్ ఓ హీరోయిన్గా ఎంపిక చేసారు. మరొకటిగా సమంత ను ఒకే చేయగా , మూడో హీరోయిన్ గా ఇప్పుడు త్రిష ను ఫిక్స్ చేసారని తెలుస్తుంది.
గతం లో కింగ్ చిత్రం లో నాగ్ కు జోడిగా త్రిష నటించింది. ఇప్పుడు మరోసారి నాగ్ తో రొమాన్స్ చేసే అవకాశం దక్కింది. పీవీపీ బ్యానర్ లో ఈ మూవీ ని వర ప్రసాద్ భారీ బడ్జెట్ తో మూవీ ని నిర్మించబోతున్నాడు. అక్కినేని నాగార్జున, వెన్నెల కిషోర్, అశ్విన్ బాబు, ప్రవీణ్, షకలక శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ – దివాకరన్, మ్యూజిక్ – తమన్, ఆర్ట్ – ఎ.ఎస్.ప్రకాష్, డైలాగ్స్ – అబ్బూరి రవి, నిర్మాత – పి.వి.పి, దర్శకత్వం – ఓంకార్.