ఎన్టీఆర్ మొదటిసారి ఆ పని చేయబోతున్నాడు..

Ghazi

టాలీవుడ్ ఇండస్ట్రీ లో డైలాగ్స్ చెప్పడం లో ఎన్టీఆర్ తర్వాతే ఏ హీరోయినా..అనే సంగతి అందరి తెల్సిందే..ఎలాంటి డైలాగ్ అయినా సింగిల్ టెక్ లో చెప్పే ఎన్టీఆర్ , ఇప్పటివరకు వేరే హీరోల చిత్రాల వాయిస్ ఓవర్ ఇవ్వలేదు..తన అన్న కళ్యాణ్ రామ్ చిత్రానికి మాత్రమే ఒక్కసారి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అటువంటిది మొదటి సారి ఎన్టీఆర్ వేరే హీరో చిత్రానికి తన వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని సమాచారం..

NTR-VOice-Over-for-Ghazi

రానా , తాప్సి జంటగా తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో తెరకెక్కిన ఘాజీ చిత్రానికి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడట. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పీవీపీ సంస్థ నిర్మించింది. హిందీ వర్షన్ కు లెజెండరీ యాక్టర్ బిగ్ బి అమితాబ్ వాయిస్ ఓవర్ ఇవ్వగా , తెలుగు లో మాత్రం ఎన్టీఆర్ ఇస్తుండడం విశేషం. తమిళ వెర్షన్ కోసం సూర్య లేదా ఇంకెవరైనా ప్రముఖ నటుడితో వాయిస్ ఇప్పించాలని చూస్తున్నారు పీవీపీ. 1971 నాటి ఇండియా-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.

ఇండియాలో తెరకెక్కుతున్న తొలి సబ్ మెరైన్ వార్ మూవీ ‘ఘాజీ’ కావడం విశేషం. ఫిబ్రవరిలో 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.