తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు “వస్తున్నా… మీకోసం” పాదయాత్రలో బీజిగా ఉండగా.. ఆయన తనయుడు నారాలోకేష్ నేటి నుంచి 10వ తేది వరకు నాలుగు రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు సైతం పూర్తయినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
టీడీపీ అధినేత “వస్తున్నా.. మీకోసం” పాదయాత్రలో ఉన్నందున బాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో ప్రజల సమస్యలను లోకేష్ దగ్గరుండి పరిష్కరిస్తూ.. పార్టీ పరిస్థితిని సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలో స్థానికి సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా లోకేష్ పర్యటన ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. లోకేష్ తరచూ చిత్తూరు జిల్లాలో పర్యటించడం సాధారణమే అయినా ఈసారి నాలుగురోజుల పర్యటనలో ప్రత్యేకించి రాజకీయ కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనేలా ప్రణాళిక సిద్దం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.






(4.89 out of 5)
