ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మీ ప్రాస్సిక్యూషన్ కు కేంద్రం అనుమతిని మంజూరు చేసింది. ఈరోజు (గురువారం) సమావేశమయిన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మీపై వచ్చిన అవినీతి నిరోధక చట్టం ఆరోపణలపై న్యాయస్థానం విచారణకు అనుమతిని ఇస్తూ.. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా కేంద్రం నుండి లభించిన అనుమతితో ఐపిసి, పిసి యాక్టుల కింద ఆమెను విచారించేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఓఎంసీకి గనుల లీజు కట్టబెట్టడంలో శ్రీలక్శ్మీ అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలు శ్రీలక్ష్మీపై నమోదైన విషయం తెలిసిందే. కాగా, శ్రీలక్ష్మీపై ఐపీసీ అభియోగాలను సీబీఐ కోర్టు ఇప్పటికే విచారణకు స్వీకరించింది. తన బెయిల్ పిటిషన్ ను పొడిగించాలని శ్రీలక్ష్మీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో.. తాజాగా కేంద్రం విచారణకు అనుమతిని ఇవ్వడం నిజంగా ఆమెకు ఎదురు దెబ్బే అని విశ్లేషకులు అంటున్నారు.
శ్రీలక్ష్మీ ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతి
Published onMarch 07th, 2013 3:48 pm | Posted by






(4.00 out of 5)
